Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎంపీ ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు...రీజన్ ఇదేనా !

By:  Tupaki Desk   |   11 Jun 2021 11:17 AM GMT
టీఆర్ఎస్ ఎంపీ  ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు...రీజన్ ఇదేనా !
X
టీఆర్‌ ఎస్ లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీ ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్‌ లో ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు నిర్వహింస్తోంది. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు రూ.వెయ్యి కోట్లకు పైగా రుణాలు పొందినట్టు అభియోగాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని అభియోగాలు ఉన్నాయి. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోప‌ణ‌లు వచ్చిన నేప‌థ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాల‌పై త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు అడుగుతున్నారు.

దాదాపు రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకున్నారు నామా.. పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఎంపీ ఆస్తులపై ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే దీని పైన నామా నాగేశ్వర రావు స్పందించాల్సి ఉంది .గతంలో నమోదైన కేసులో భాగంగానే ఇప్పుడు ఈడీ సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సోదాల గురించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వివరాలు వెల్లడించాల్సి ఉంది. మధుకాన్ పై 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్ షీటు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. నామాతో పాటుగా కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.