Begin typing your search above and press return to search.

ఎలక్షన్ ట్రెండ్: తిరుపతిలో వైసీపీ, సాగర్ లో టీఆర్ఎస్ లీడ్

By:  Tupaki Desk   |   2 May 2021 4:59 AM GMT
ఎలక్షన్ ట్రెండ్: తిరుపతిలో వైసీపీ, సాగర్ లో టీఆర్ఎస్ లీడ్
X
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలదే హవా నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో ఉంది. వైసీపీకి 47098 ఓట్లు రాగా.. ప్రతిపక్షం టీడీపీ 24811 ఓట్లు వచ్చాయి. దాదాపు 22వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ దూసుకుపోతోంది.

ఇక నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తన సీనియర్ కాంగ్రెస్ ప్రత్యర్థి జానారెడ్డిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సాగర్ లో 23524 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి 174979 ఓట్లు సాధించారు. బీజేపీకి కేవలం 957 ఓట్లు వచ్చాయి. దాదాపు 6వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ సాగర్ లో దూసుకుపోతోంది.