Begin typing your search above and press return to search.

తాగినోళ్లకు సిగ్నల్ పడితే మాత్రం లెక్కేంటి.. ఆగిన బైకుపైకి దూసుకెళ్లిన బెంజ్

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:32 PM GMT
తాగినోళ్లకు సిగ్నల్ పడితే మాత్రం లెక్కేంటి.. ఆగిన బైకుపైకి దూసుకెళ్లిన బెంజ్
X
హైదరాబాద్​ సైబర్​టవర్స్​ సిగ్నల్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి సిగ్నల్​ పడ్డ విషయం కూడా మరిచిపోయి తన కారును దంపతులు ప్రయాణిస్తున్న టూవీలర్​మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇందుకు సంబంధించిన వివరాలు.. ఒడిశాకు చెందిన గౌతమ్​దేవ్​ తన భార్య శ్వేతతో టూవీలర్​పై ఆఫీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మాదాపూర్​లోని సైబర్​ టవర్​ వద్ద సిగ్నల్​ పడటంతో టూవీలర్​ను ఆపాడు.

కాశీ విశ్వనాథ్, కౌశిక్ అనే ఇద్దరు యువకులు రాత్రంతా పబ్బులో తాగి తెల్లవారు జామున ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో సైబర్​ టవర్స్​ వద్ద సిగ్నల్​ పడిఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా తమ బెంజ్​కారును ముందుకుపోనిచ్చారు. ద్విచక్ర వాహనం ఢీకొని వెళ్లారు.దీంతో వాహనం మీద ఉన్న గౌతమ్​దేవ్​, అతడి భార్య శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని సమీపంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లగా గౌతమ్​దేవ్​ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం కోమాలోకి వెళ్లింది. నిర్లక్ష్యంగా కారును నడిపిన కాశీ విశ్వనాథ్ అతడి స్నేహితుడు కౌశిక్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లాక్​డౌన్​ సడలింపులతో బార్లు, పబ్బులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉంటున్నాయి. మరికొన్ని పబ్బలు ఉదయం నాలుగు గంటలవరకు ఓపెన్​ ఉంటున్నాయి. దీంతో కొందరు బడాబాబులు ఫుల్​గా మద్యం సేవించి రోడ్లమీదకు వస్తున్నారు. తాగిన మత్తులో ఎంత స్పీడ్ గా వెళ్తున్నది వాళ్లు లెక్క చేయడం లేదు. తెల్లవారుజామున డ్రంకెన్​ డ్రైవ్​ ఉండదన్న కారణంతో మితిమీరిన వేగంతో వాహనాలు డ్రైవ్​ చేస్తున్నారు. మద్యం బాబుల రాంగ్ డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన మార్గాల్లోనే ఈ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.