Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కలకలం..రూ.50కోట్ల డ్రగ్స్ సీజ్

By:  Tupaki Desk   |   17 Aug 2020 5:21 PM GMT
హైదరాబాద్ లో కలకలం..రూ.50కోట్ల డ్రగ్స్ సీజ్
X
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. భారీగా పట్టుబడ్డాయి. ఈ మధ్యకాలంలో ఇంత భారీగా కేసులు నమోదు కాలేదు. ఒకప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా ఉండగా.. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో కంట్రోల్ లోకి వచ్చింది. కరోనాకు మూలాలు కట్ చేశారు. పబ్ లు, సినీ ఇండస్ట్రీపై నిఘా పెట్టడంతో కట్టడైంది.

అయితే హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదని తాజాగా నిరూపితమైంది. హైదరాబాద్ శివారుల్లో భారీగా డ్రగ్స్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు.

తాజాగా దాదాపు రూ.50 కోట్లు విలువ చేసే 250 కేజీల మత్తుమందును.. రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కాగా మూడు రోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ వస్తున్నట్టు పక్కా సమాచారం ఆధారంగానే ఈ డ్రగ్స్ ను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్గో బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి ఈ మత్తుమందును తరలిస్తున్నట్టు చెప్పారు.