Begin typing your search above and press return to search.

కరోనా వేళ గృహహింస.. కాస్త ఓపిక అవసరం

By:  Tupaki Desk   |   28 July 2020 11:30 PM GMT
కరోనా వేళ గృహహింస.. కాస్త ఓపిక అవసరం
X
కరోనా లాక్ డౌన్ లో పనిలేక భార్య భర్తలు ఇంట్లోనే ఉండేసరికి గృహ హింస చాలా పెరిగిందని సర్వేలో తేలింది. గొడవలు ఎక్కువై పోలీస్ స్టేషన్ లో కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆఫీసులకు వెళ్లే భర్తలు రాత్రికి ఇంటికి చేరుకొని కాసింత తిని పడుకునే వారు. దాంతో గొడవలు తక్కువగా జరిగేవి. ఇప్పుడు పొద్దంతా ఇంట్లోనే ఉండి బిర్యానీలు, టిఫిన్లు, స్నాక్స్ చేయమంటూ సతాయించడంతో భార్యలతో గొడవలు అయిపోతున్నాయని తేలింది.

సంసారం గురించి.. భార్య/భర్త బాధితుల గురించి ఎన్నో సినిమాలు, సీరియల్లు, కామెడీ షోల్లో వివరిస్తూనే ఉంటారు. పెళ్లి అయితే స్వేచ్ఛ హుళక్కేనా..? ఆ చట్రంలో ఇరుక్కుపోవాల్సిందేనా..? పెళ్లితో బంధంలోకి అడుగుపెట్టడం లాభమా? నష్టమా అన్న దానిపై బ్రిటన్ లోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధించారు.

అప్పటివరకు బ్యాచ్ లర్ గా ఇష్టమైన జీవితం గడిపిన వారు పెళ్లి కాగానే బందీ అయిపోయినట్టు ఫీలవుతారు.. పెళ్లి చేసుకుంటే రాత్రి ఠంచనుగా ఇంటికి రావాలి.. పెళ్లాం, పిల్లల్ని చూసుకోవాలి.. బయట ఆఫీసులో గడ్డి చాకిరీ చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. లేకపోతే ఆ మగాడికి.. ఆ మొగుడికి విలువ లేదని దెప్పిపొడుస్తారు ఆడవాళ్లు..

గుండె జబ్బులు, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం ముప్పు ఎదుర్కొంటున్న దాదాపు పది లక్షల మందిపై ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఐదేళ్ల తరువాత మరోసారి పరీక్షించారు. పెళ్లి కాని వారితో పోలిస్లే.. పెళ్లయిన వారిలో ఈ లక్షణాలు బాగా తగ్గిపోయాయట.. అవివాహితుల్లో పైన జబ్బులన్నీ 16శాతం పెరిగిపోయాయని తేలింది.

పైన జబ్బులన్నీ రాకుండా ఉండాలంటే కుటుంబ బంధాలే ముఖ్యమని.. ఎవరైనా తోడుంటే ఏ జబ్బులు దరిచేరవని పరిశోధకులు తేల్చారు. పెళ్లి అయినవారిలో జబ్బులు తగ్గి.. పెళ్లి కానీ వారిలో జబ్బులు పెరిగిపోయాయని తేల్చారు. పెళ్లంటే నూరేళ్ల మంట కాదు.. పంట అని పరిశోధకులు తేల్చారు. కాబట్టి గొడవలు ప్రేమతోనే ఎదుర్కోండి. ఈ కరోనా లాక్ డౌన్లో భార్య/భర్త కాస్త సంయమనం పాటిస్తే తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవచ్చు. సంసారాన్ని చక్కదిద్దుకోవచ్చు. కావాల్సిందల్లా కాసింత ఓపికే..