Begin typing your search above and press return to search.

ఆ నలుగురి ఎన్ కౌంటర్ కు 11 బుల్లెట్లు.. ఎక్కడెక్కడ దిగాయంటే?

By:  Tupaki Desk   |   7 Dec 2019 4:42 AM GMT
ఆ నలుగురి ఎన్ కౌంటర్ కు 11 బుల్లెట్లు.. ఎక్కడెక్కడ దిగాయంటే?
X
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన కీలకమైన విషయాలు కొన్ని పెద్దగా ఫోకస్ కాలేదు. ఆ కోవకు చెందిందే ఈ ఉదంతం. అమానవీయ రీతిలో దిశ పట్ల కిరాతకంగా వ్యవహరించిన నలుగురు దుర్మార్గుల్ని అంతమొందించేందుకు పోలీసులు 11 బుల్లెట్ల ను వినియోగించారు. పోలీసుల పై రాళ్లు.. కర్రలతో దాడి చేయటం తో పాటు.. వారి వద్ద ఆయుధాలు లాక్కున్న వేళ.. ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు మొత్తం 11 బుల్లెట్లను వినియోగించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం దిశ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ శరీరం లో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఛాతీలో రెండు.. కుడివైపు పక్కటెముకలో ఒక బుల్లెట్ దిగినట్లుగా తెలుస్తోంది. మరో నిందితుడు శివ శరీరం పైన మూడు బుల్లెట్ గాయాలు ఉన్నాయి. మూడు గాయాలు శరీరానికే తగిలాయి. నవీన్ తలకు ఒక్క బుల్లెట్ గాయంతోనే కుప్పకూలినట్లుగా సమాచారం. నాలుగో నిందితుడైన చెన్నకేశవులుకు మూడు బుల్లెట్ గాయాలతో ఉన్నట్లు గుర్తించారు.

ఒక్క బుల్లెట్ గాయం తో కుప్ప కూలిన నవీన్ కు తలలో కుడి వైపు చెవి వెనుక బుల్లెట్ దిగిన ఆనవాళ్లు కనిపించాయి. చెన్నకేశవులు మర్మాంగం నుంచి రక్తస్రావం జరిగినట్లుగా చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. నలుగురు నిందితుల మరణానికి కారణమైన 11 బుల్లెట్లలో ఏ ఒక్కటి కూడా నిందితుల శరీరంలో లేదు. తీవ్రమైన గాయం చేస్తూ.. దూసుకెళ్లి పోయాయి. దీంతో.. ఒక్క బుల్లెట్ కూడా రికవరీ కాలేదు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపటం వల్లే బుల్లెట్లు శరీరం నుంచి బయటకు వెళ్లి పోయినట్లుగా చెబుతున్నారు.