Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై

By:  Tupaki Desk   |   15 Aug 2020 3:30 PM GMT
బిగ్ బ్రేకింగ్: అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై
X
అంతర్జాతీయ క్రికెట్ లో బిగ్ బ్రేకింగ్ నమోదైంది. భారత క్రికెట్ లో ధృవతార.. రెండు ప్రపంచకప్ లో భారత్ కు అందించిన దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ప్రస్తుతం చెన్నైలో క్యాంప్ లో ఉన్నారు. సడన్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో మెమొరీస్ వీడియోను పోస్ట్ చేసి తాను ఈ సాయంత్రం 7.29 గంటల నుంచి రిటైర్ అవుతున్నట్లు అందరూ గమనించాలని కోరారు. తన ఇన్నేళ్ల క్రికెట్ లో తనకు సహకరించిన అభిమానులు.. తోటి క్రికెటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

‘కెరీర్ లో సాంతం నన్ను ప్రేమించి.. మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.. 19.29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని వీడియోను ఎంఎస్ ధోని పోస్టు చేశాడు.

గత ఏడాది ప్రపంచకప్ లో న్యూజిలాండ్ లో సెమీఫైనల్ లో చివరి మ్యాచ్ ఆడిన ధోని అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్నాడు.ఇక నుంచి ఐపీఎల్ లో మాత్రమే ధోని కొనసాగుతాడు.

2007 టీ20 ప్రపంచకప్ తోపాటుగా 2011 వన్డే ప్రపంచకప్, అలాగే చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాడు. టెస్టులలో ఇండియాను నంబర్ 1గా నిలిపాడు. భారత క్రికెట్ లోనే తిరుగులేని విజయాలను అందించిన గొప్ప కెప్టెన్ గా ధోని రికార్డుల్లో నిలిచారు.