Begin typing your search above and press return to search.

లోకేశ్ చెంచాగిరీ చేస్తున్నా...తప్పేంటి?

By:  Tupaki Desk   |   8 May 2017 10:03 AM GMT
లోకేశ్ చెంచాగిరీ చేస్తున్నా...తప్పేంటి?
X
ఇటీవల మరణించిన దేవినేని నెహ్రూ తనయుడు, టీడీపీ విజయవాడ నేత దేవినేని అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌ కు తాను చెమ్చాగిరి చేస్తున్నానని... అందులో తప్పేమీ లేదని.. చంద్రబాబు తర్వాత తమ లీడర్ లోకేషే కాబట్టి ఆయనకు చెమ్చాగిరీ చేస్తున్నానని అన్నారు.

లోకేశ్ కు ఉన్న విజన్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి గానీ, మరెవ్వరికీ లేదని అవినాశ్ అన్నారు. రాష్ట్రాన్ని, ఈ పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రతి కార్యకర్తకు ఏ విధంగా అండగా ఉండాలనే లక్ష్యం ఉన్న నాయకుడు లోకేశ్ మాత్రమేనని చెప్పారు.

లోకేశ్ కు అలాంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఆయానకు అండగా ఉంటూ చెంచాగిరి చేస్తామని, ఆయనతోనే ఉంటామని, పోరాటం చేస్తామని, ఆయన ఏం చెప్పినా చేస్తామని అవినాశ్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున తనకు టిక్కెట్ రాకపోయినా పార్టీ కోసం పని చేస్తానని తేల్చి చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కోసం పని చేస్తానన్నారు. తాము టిడిపిలో చేరేటప్పుడే ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/