Begin typing your search above and press return to search.

ఆ కుర్రాడ్ని బీజేపీ ఎమ్మెల్యే ఎందుకు కొట్టారంటే?

By:  Tupaki Desk   |   16 Feb 2016 6:43 AM GMT
ఆ కుర్రాడ్ని బీజేపీ ఎమ్మెల్యే ఎందుకు కొట్టారంటే?
X
రోడ్డు మీద తన దారిన తాను వెళుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఒక కుర్రాడిని చితక్కొట్టేయటం సంచలనం సృష్టించింది. మీడియాలో ప్రముఖంగా ఫోటోలు అచ్చయ్యాయి. మ్యాటర్ ను చదవకుండా ఫోటోను చూస్తే.. ఆయ్యో ఆ కుర్రాడ్ని అంతలా కొడుతున్నారే అనిపించక మానదు.కానీ.. ఆ కుర్రాడిని సదరు ఎమ్మెల్యే కొట్టటానికి కారణం ఏమిటన్న లోతుల్లోకి వెళితే మాత్రం.. సదరు బీజేపీ ఎమ్మెల్యేది ధర్మాగ్రహంగా అనిపించక మానదు.

ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమీపంలో ఢిల్లీ ఎమ్మెల్యే ఓపీ శర్మ తన అనుచరులతో రోడ్డు మీద వెళుతున్నారు. అదే సమయంలో ఒక యువకుడు ‘‘పాకిస్థాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించాడు. ఈ మాటను విన్న వెంటనే శర్మకు కోపం నశాళానికి అంటింది. తన కళ్ల ముందే పాకిస్థాన్ జిందాబాద్ అనటాన్ని జీర్ణించుకోలేని ఆయన.. అతడి మీద దాడికి దిగారు.

ఎమ్మెల్యే అలా కొట్టటంతో మీడియా ప్రతినిధులు తమ కెమేరాల్ని ఫోకస్ చేయటం.. ఆ వెంటనే వచ్చిన పోలీసులు.. ఆ కుర్రాడిని ఎమ్మెల్యే బారి నుంచి కాపాడి తీసుకెళ్లారు. ఓపీ శర్మ దాడి ఘటనకు సంబంధించి దృశ్యాల్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేయటంతో ఓపీ శర్మ వ్యవహారం ఇప్పుడు పెద్ద వార్తాంశంగా మారింది. కాకుంటే.. దాడి గురించి ప్రముఖంగా చెబుతున్న చాలామంది.. అసలు విషయాన్ని మాత్రం కాస్త తక్కువ చేసి చెప్పటం గమనార్హం.