Begin typing your search above and press return to search.

ఆత్మహత్యాయత్నం కేసులో ‘షర్మిల’ నిర్దోషి

By:  Tupaki Desk   |   30 March 2016 11:14 AM GMT
ఆత్మహత్యాయత్నం కేసులో ‘షర్మిల’ నిర్దోషి
X
మణిపూర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్‌ షర్మిల ఛాను 2006 నాటి ఆత్మహత్యాయత్నం కేసు నుంచి నిర్దోషిగా బైటపడ్డారు. ఈ కేసులో షర్మిల నిర్దోషి అని పాటియాలా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివాదాస్పద భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు చేయాలంటూ సుమారు 16 సంవత్సరాలపాటు షర్మిల నిరశన దీక్ష చేపట్టింది. 2013లో ఈ కేసుకు సంబంధించి తాను తప్పు చేసినట్లు షర్మిల అంగీకరించలేదు. దీనితో కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అప్పటినుంచి షర్మిల బెయిల్‌పై ఉన్నారు. కాగా ఈ చట్టాన్ని రద్దు చేస్తే తన నిరశన దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల పేర్కొంది. ఈ అంశంపై చర్చించడానికి ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమవుతానని ఆమె చెప్పింది.

మణిపూర్‌ ఉక్కు మహిళగా పేరొందిన పౌర హ‌క్కుల ఉద్య‌మ‌కారిణి ఇరోమ్‌ షర్మిల 2006లో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక దీక్షకు దిగిన విష‌యం తెలిసిందే. 2013లో ఈ కేసుకు సంబంధించి ఆమెపై ఆత్మహత్యా నేరం కింద ఢిల్లీ న్యాయస్థానంలో పోలీసులు చార్జి షీట్ కేసు దాఖలు చేశారు. అప్పటినుంచి షర్మిల బెయిల్‌పై ఉన్నారు. అయితే, తాజాగా తుది విచారణ సందర్భంగా తాను నేరం చేసినట్లు షర్మిల అంగీకరించలేదు. తన లక్ష్యాన్ని సాధించడం కోసం నిరాహార దీక్షను తాను కేవలం ఒక ఆయుధంగా మాత్రమే వాడుకున్నానని, జాతిపిత మహాత్మా గాంధీ సైతం ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేశారని ఆమె వాదించింది. తన జీవితాన్ని తాను ఎంతో ప్రేమిస్తున్నానని, అలాంటప్పుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడతానని ఆమె ప్రశ్నించింది. ఈ చట్టాన్ని రద్దు చేస్తే తన నిర‌స‌న దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమవుతానని ఆమె చెప్పారు. ఆత్మ‌హత్య చేసుకునే ఉద్దేశం త‌న‌కెప్పుడూ ఉండ‌బోద‌ని, ఆ చట్టానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాడుతున్నానని తెలిపారు.