Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి మేనల్లుడికి కరోనా?

By:  Tupaki Desk   |   26 Jun 2020 10:00 AM IST
ఏపీ మంత్రి మేనల్లుడికి కరోనా?
X
మహమ్మారి కు కాదు ఎవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారి ద్వారా వారి భార్యలు, గన్ మెన్లు, డ్రైవర్లకు వ్యాపించింది.

ఇటీవలే ఏపీ లోనూ ఎస్.కోట ఎమ్మెల్యే మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా అధికార పార్టీకే చెందిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే మనవడికి మహమ్మారి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అతడి తో పాటు ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు పని వాళ్లకు కూడా మహమ్మారి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.దీంతో కలకలం చెలరేగింది.

ఇక ఏపీ లో మంత్రుల కుటుంబాలకు కూడా మహమ్మారి సోకుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి ఓ కీలక నేతకు పాజిటివ్ గా తేలింది. ఆ నాయకుడు జిల్లాలో ఓ మంత్రికి స్వయానా మేనల్లుడు. ఇటీవల అత్యవసర పనులపై హైదరాబాద్ వెళ్లి వస్తున్న కారణంగా ఆయనకు వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

మంత్రి మేనల్లుడిని ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవికుమార్ వెల్లడించారు.