Begin typing your search above and press return to search.

ఎర్రగడ్డ రైతుబజార్ లో కరోనా కల్లోలం ..3 రోజులు బంద్

By:  Tupaki Desk   |   6 July 2020 4:20 PM IST
ఎర్రగడ్డ  రైతుబజార్ లో కరోనా కల్లోలం ..3 రోజులు బంద్
X
హైదరాబాద్‌ లోని ఎర్రగడ్డ రైతు బజార్ లో వైరస్ కలకలం సృష్టించింది. ఎర్రగడ్డ రైతు బజారులోని ఓ కాంట్రాక్టర్‌ తాజాగా కరోనా వైరస్‌ తో మృతి చెందారు. దీనితో మూడు రోజుల పాటు ఎర్రగడ్డ రైతు బజార్ ‌ను అధికారులు మూసివేస్తున్నారు. ముందుగా రైతు బజార్ లో ‌ శానిటైజైషన్‌ చేశారు. అలాగే ఆయన తో కాంటాక్ట్ అయిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్ ‌లో ఉండాలని అధికారులు సూచించారు.

అలాగే ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కాగా ఎర్రగడ్డ రైతు బజార్‌ లో కరోనా కలకలంతో మార్కెట్‌ కు వెళ్లినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నగరంలోని అన్ని ఏరియాలలో కేసులు నమోదయ్యాయి. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత నగరంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో భరత్ నగర్ మార్కెట్ లో కూరగాయలు అమ్మే ఒక వ్యక్తి కరోనా భారీన పడటంతో మార్కెట్ మూసివేసిన సంగతి తెలిసిందే.

తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5290 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1590 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23902 కేసులు నమోదు కాగా, 295 మంది మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 10904 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.