Begin typing your search above and press return to search.

ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 3,342 కేసులు - 20 మరణాలు!

By:  Tupaki Desk   |   24 Oct 2020 10:30 PM IST
ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 3,342 కేసులు - 20 మరణాలు!
X
ఏపీలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు కాగా, శనివారం కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 74,919 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,342 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 8,04,026 కి చేరింది.

శనివారం కరోనా బారినపడి 22 మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,566కు చేరుకుంది. శనివారం 3,572 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,04,026 పాజిటివ్ కేసులకు గాను.. 7,65,991 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 31,469 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, కడపలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు.