Begin typing your search above and press return to search.

ఏపీలో అసెంబ్లీలో కరోనా కలకలం.. 9మందికి పాజిటివ్

By:  Tupaki Desk   |   20 July 2020 3:20 PM IST
ఏపీలో అసెంబ్లీలో కరోనా కలకలం.. 9మందికి పాజిటివ్
X

ఏపీలో కరోనా కేసుల సంఖ్య జెట్ స్పీడులా పెరుగుతున్నాయి. నిన్న 5వేలకు పైగా నమోదయ్యాయి. టెస్టుల సంఖ్య భారీగా పెంచడంతోనే వైరస్ బయటపడుతోంది. పరిస్థితి రోజురోజుకు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

మూడురోజులుగా ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లోనే సుమారు 10వేల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు పెరగడంతోపాటు మరణాలు కూడా రోజుకు 50కి పైనే ఉంటున్నాయి. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులు సామాన్యులు ఇలా అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీని కరోనా ఆవహించింది. తాజాగా అసెంబ్లీలో పనిచేస్తున్న 9మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కు చేరుకుంది. మరికొందరు రిపోర్టులు రావాల్సి ఉండడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అసెంబ్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అసెంబ్లీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఏపీలో నిన్న 5041 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49605కి చేరింది.