Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే మనవడికి మహమ్మారి.. ఎమ్మెల్యేకు పరీక్షలు

By:  Tupaki Desk   |   25 Jun 2020 3:20 PM IST
ఎమ్మెల్యే మనవడికి మహమ్మారి.. ఎమ్మెల్యేకు పరీక్షలు
X
మహమ్మారికు కాదు ఎవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే తెలంగాణ లో ముగ్గురు ఎమ్మెల్యేలు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారి ద్వారా వారి భార్యలు, గన్ మెన్లు, డ్రైవర్లకు వ్యాపించింది.

ఇటీవలే ఏపీలోనూ ఎస్.కోట ఎమ్మెల్యే మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా అధికార పార్టీకే చెందిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే మనవడికి మహమ్మారి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అతడితోపాటు ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు పనివాళ్లకు కూడా మహమ్మారి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.దీంతో కలకలం చెలరేగింది.

అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడికి మహమ్మారిగా తేలడం తో ఎమ్మెల్యే షాకైనట్టు తెలిసింది.. వెంటనే ఎమ్మెల్యేకు కూడా అధికారులు మహమ్మారి పరీక్షలు జరిపారు. రిపోర్టులు రావాల్సి ఉంది. రిపోర్టులు వస్తే ఏపీ లో మహమ్మారి సోకిన రెండో ఎమ్మెల్యే గా ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అవుతారు. మనవడి ద్వారా ఈయనకు మహమ్మారి వచ్చిందో రాలేదో రిపోర్టుల ద్వారా తేలనుంది.