Begin typing your search above and press return to search.

ప్రజలకు గుడ్ న్యూస్: దళితబంధు అమలు

By:  Tupaki Desk   |   9 Aug 2021 10:37 AM GMT
ప్రజలకు గుడ్ న్యూస్: దళితబంధు అమలు
X
హుజూరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో 'దళితబంధు'ణు అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పథకం కింద రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.

కాగా హుజూరాబాద్ లో 'దళితబంధు' పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఈసీతోపాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులను పిటీషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దళితబంధు అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందన్న భయంతో ముందుగానే సర్దుకుంది. దళితబంధును అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.