Begin typing your search above and press return to search.

ఒక్క మంత్రంతో కరోనా వైరస్ మాయమంట..?

By:  Tupaki Desk   |   29 Jan 2020 10:30 AM GMT
ఒక్క మంత్రంతో కరోనా వైరస్ మాయమంట..?
X
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే రాలవు అంటారు నేటి తరం వారు.. అయితే ఒకప్పుడు రాలేవంటారు పెద్దవారు.. కానీ ఇప్పుడు అదే మంత్రాలకు ప్రపంచ వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ తగ్గిపోతుందని అంటున్నారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా..

మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన ‘సిక్స్త్ సెన్స్ ’ మూవీ చూసిన వారికి ఇప్పుడు కరోనా వైరస్ కు దగ్గరి సంబంధాలున్నాయని అంటుంటారు. నాడు కూడా ఇదే చైనాలో భయంకర వైరస్ వ్యాపిస్తే మన దేశం నుంచి వెళ్లిన బోధి ధర్మ అనే బౌద్ధ సన్యాసి ఆ వ్యాధిని నయం చేస్తాడు. ఇప్పుడే అదే పనిని మన దేశంలో ఉన్న బౌద్ధ సన్యాసి చేస్తానంటుండడం విశేషం. దీన్ని బట్టి సక్స్త్ సెన్స్ మూవీ రిపీట్ అయ్యిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

చైనాను ఇప్పుడు కరోనా వైరస్ వణికిస్తోంది. దాదాపు 130మంది ఇప్పటికే ఈ అంతుచిక్కని వైరస్ తో చనిపోయారు. వేలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు ఆయన భక్తులు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్ బుక్ లో టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను కోరారు.

తన భక్తుల కోరికను స్పందించిన దలైలామా తాజాగా కరోనా వైరస్ బారిన పడకుండా ‘తారా మంత్రం’ పఠించాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ఈ మంత్రం సాయపడుతుందని చెప్పారు. ఈ మేరకు ‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ మంత్రాన్ని స్వయంగా దలైలామా పఠించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కరోనా వైరస్ చావు భయంతో దలైలామా భక్తులే కాదు.. చైనా ప్రజలంతా ఇప్పుడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నారు. ఇప్పుడీ దలైలామా మంత్రం వైరల్ అవుతోంది.