Begin typing your search above and press return to search.

టీడీపీని - అచ్చెన్నను స్కాంలో ఇరికించింది ఒక్కడే

By:  Tupaki Desk   |   23 Feb 2020 5:22 AM GMT
టీడీపీని - అచ్చెన్నను స్కాంలో ఇరికించింది ఒక్కడే
X
ఈఎస్ ఐ స్కామ్.. ఇప్పుడు ఏపీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన కుంభకోణం. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ స్కామ్ అసలు ఎలా బయటపడిందనేది ఆసక్తిగా మారింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం బయటపడడానికి కారకులెవరు? వైసీపీ ప్రభుత్వంలో వెలుగులోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలోని ఈ స్కామ్ ను అసలు బయటపెట్టింది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ. మధు. ఆయన ఫిర్యాదు వల్లే ఇవాళ టీడీపీ పునాదులు కదిలే అతిపెద్ద కుంభకోణం బయటపడింది.

మొదట ఈ ఈఎస్ ఐ స్కామ్ తెలంగాణలో బయటపడింది. అయితే ఈ మూలాలు ఏపీలోనూ ఉన్నాయి.. ఇది భారీ అవినీతి అని.. దీన్ని ఏసీబీతో విచారణ జరిపించాలని సీపీఎం మధు ఈ ఏడాది జనవరి 10న సీఎం జగన్ కు లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగుచూసింది. తెలంగాణలో ఈఎస్ ఐ అవినీతిలో మోసానికి పాల్పడ్డ మెడికల్ కంపెనీలు ఏపీలోనూ ఇలానే చేశాయని దీనిపై విచారణ జరపాలని మధు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలు కార్మికుల సొమ్మును కొల్లగొట్టినట్లు మధు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

మధు లేఖపై జగన్ సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది.విజిలెన్స్ తో విచారణ జరిపించింది. ఈ స్కాంలో ఏకంగా 975.79 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూసింది. 151 కోట్ల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ తేల్చింది. ఈ నివేదికతో టీడీపీ శిభిరం షేక్ అవుతోంది.

నామినేషన్ ప్రాతిపదికన 3, లేదా 4 కంపెనీల నుంచే మందులు కొనుగోలు చేశారని.. దీనికి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖే ప్రాతిపదికన నివేదికలో తేలింది. దీంతో మాజీ మంత్రి అచ్చెన్న బుక్కైపోయారు. వైసీపీపై ఒంటికాలిపై లేచే అచ్చెన్నకు ఈఎస్ఐ స్కాం గుదిబండగా తయారైంది. ఆయనను బుక్ చేసే అవకాశం వైసీపీ సర్కారు కు దొరికినట్టైంది. సీపీఎం మధు రాసిన లేఖే ఇప్పుడు మాజీ మంత్రి అచ్చెన్న సహా టీడీపీ ప్రభుత్వాన్ని పెద్ద స్కాంలో ఇరికించినట్టైంది.