Begin typing your search above and press return to search.

రెండు డోసులు కొవాగ్జిన్ తీసుకున్నారా.. అయితే మీరు ఫుల్ సేఫ్!

By:  Tupaki Desk   |   8 April 2022 7:30 AM GMT
రెండు డోసులు కొవాగ్జిన్ తీసుకున్నారా.. అయితే మీరు ఫుల్ సేఫ్!
X
కొవాగ్జిన్ రెండు డోసులు టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ కు గురైన వారిలో రోగ నిరోధక ప్రతి స్పందనలు అత్యంత అధిక స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఆందోళనకర వేరియంట్లు అయిన బీటా, డెల్టా, ఒమిక్రాన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్ లేదా టీకా దోహదపడుతున్నట్లు వెల్లడైంది.

భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రగ్యా యాదవ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఒమిక్రాన్ కారణంగా కారణంగా దేశంలో మూడో దశ కొవిడ్ ఉధృతి నెలకొనడం వల్ల కొవాగ్జిన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ అధ్యయనం సాగించారు. వివిధ వయసుల వారిలో ఈ టీకా పనితీరు, రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ సోకిన వారిలో రోగ నిరోధక స్పందనలు ఎలా ఉన్నాయన్నది పరిశోధకులు నిశితంగా అధ్యయనం చేశారు.

సగటున రెండో డోసు తీసుకున్న 43 రోజుల తర్వాత బ్రేక్ త్రూ కేసులు నమోదవుతున్నట్లు లెక్కగట్టారు. ఇలాంటి 95 శాతం కేసుల్లో లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయని కొందరిలో అసలు లక్షణాలు ఉండటం లేదని గుర్తించారు.

రెండు డోసులు తర్వాత కొవిడ్ కు గురైన వారిలో అన్ని రకాల ఆందోళనకర వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేలా చేసినట్లు వివరించారు. కొవిడ్ కు గురైన తర్వాత కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ రోగ నిరోధక శక్తి అధిక స్థాయిలో ఉంటున్నట్లు అధ్యయనంలో తేలింది.

రెండో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత టీకా కారణంగా లభించే రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతోందని... బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా ఆందోళనక వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్ఫెక్షన్ పత్రిక అందించింది. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి కొవిన్ పోర్టల్లో కొత్త ఫీచర్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

వ్యాక్సిన్ తీసుకున్న తేదీకి సంబంధించి ధ్రువ పత్రంలో ఏమైనా తప్పులు వస్తే మార్చుకునేందుకు వీలు కల్పించింది. వ్యాక్సినేషన్ ధ్రువ పత్రాల్లో పేరు, పుట్టిన సంవత్సరం. జెండర్ వంటి తప్పులను కూడా మార్చుకునే అవరాశం ఉంది. తాజాగా టీకా వేసుకున్న తేదీలో తప్పు పడితే మార్చుకునే వెసులు బాటును కూడా కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి వికాశ్ శీల్ తెలిపారు.