Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా 35 ప్రైవేట్ ల్యాబ్‌‌ ల్లో కరోనా పరీక్షలు.. తెలంగాణలో ఎన్నంటే !

By:  Tupaki Desk   |   27 March 2020 9:30 AM GMT
దేశ వ్యాప్తంగా 35 ప్రైవేట్  ల్యాబ్‌‌ ల్లో కరోనా పరీక్షలు.. తెలంగాణలో ఎన్నంటే !
X
కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కరోనా దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందకూడదు అని దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. అయితే , కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 753 కి చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పతులకే పరిమితమైన కరోనా పరీక్షల అనుమతులను ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్‌ లకు కూడా ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అనుమతులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 35 మెడికల్ ల్యాబ్‌ లకు అనుమతులు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రైవేట్ ల్యాబ్‌ లకు పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత పుణే లేబొరేటరీలో మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.

అందులో భాగంగా తెలంగాణ‌లోని ఐదు ప్రైవేటు ఆస్ప‌త్రుల ల్యాబ్‌ ల‌కు అవ‌కాశం ద‌క్కింది. తెలంగాణ లోని 5 ల్యాబ్‌లకు అనుమతి లభించింది. ఏపీలోని ఏ ఆస్పత్రికి కూడా అనుమతి దక్కలేదు. తెలంగాణలో ఉన్న ఆస్పత్రుల్లో అన్నీ హైదరాబాద్‌కు చెందినవే. అందులో జూబ్లీహిల్స్ అపోలో - హిమాయత్ నగర్‌ లోని విజయ డయాగ్నస్టిక్స్ - ఐడీఏ చర్లపల్లిలోని విమతా ల్యాబ్స్ - సికింద్రాబాద్ అపోలో - పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ ఉన్నాయి.