Begin typing your search above and press return to search.

కరోనా దూరంగా ఉండొచ్చు: శాస్త్రం ఏం చెబుతోందంటే?

By:  Tupaki Desk   |   6 March 2020 5:44 AM GMT
కరోనా దూరంగా ఉండొచ్చు: శాస్త్రం ఏం చెబుతోందంటే?
X
సన్నిబియ్యం పోయి మళ్లీ చిరు ధాన్యాల బాట పడుతున్నాం. థమ్సప్, కొకకోలాలు మరిచి రాగిజావ తాగుతున్నాం. పురాతన, మన తాతలు తిన్న తిండిని ఒకప్పుడు పశువులు కూడా తినవు అనే వాళ్లు.. ఇప్పుడు వాటినే తింటున్నారు. ఎందుకంటే అవి రోగాల రహితం.. ఆరోగ్యం పెంచేవి. నేటి తిండి అంతా రోగాల మయం. అందుకే పాత ట్రెండ్ తిండి ఆహారపు అలవాట్లు ఇప్పుడు సమాజంలో మళ్లీ వచ్చాయి. ఆరోగ్యాన్ని కాపడుకోవడానికి మన శాస్త్రాలు, పెద్దలు చెప్పినవి తూచా తప్పకుండా అందరూ చేస్తున్నారు.

కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రమ్మనడం మన సంప్రదాయం.. కానీ ఇప్పుడు ముద్దులు, హగ్గులు, చుంబనాల తో కలుసుకుంటున్నాం.. రోగాలు తెచ్చుకుంటున్నారు. భారతీయ సంప్రదాయ సంస్కారవంతమైన నమస్కారాన్ని విడమర్చి. అందుకే ఈ కరోనా వంటి రోగాలు వ్యాపిస్తున్నాయి. కరోనా వైరస్ ఈ భూ ఉపరితలం మీద 12 గంటలే బతకగలదు. సబ్బుతో కడుక్కుంటే ఆ వైరస్ చనిపోతుంది. ఇక బట్టల మీద 9గంటలే బతుకుతుంది కరోనా.. అందుకే స్పిరిట్ తో స్పే చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరోనా దరిచేరదు అంటున్నారు మన శాస్త్రం నమ్మే సిద్ధాంతులు. అవేంటో తెలుసుకుందాం..

- కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, *ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు*.

- ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, *గాలి ద్వారా వ్యాపించదు*.

- కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, *సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.

- కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

- ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.

- ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.

- కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

*గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

* కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.

మహమ్మారి కరోనా వైరసు మన దరికి చేరకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మిరియాలు ఐదు ,చిటికెడు సొంటి పొడి, చిన్న అల్లం ముక్క , కొన్ని తులసి ఆకులు, అర స్పూన్ పసుపు ఒక గ్లాస్ ఆవుపాలలో కలిపి మరిగించి రోజు రెండు పూటలు సేవిస్తే కరోనా వైరస్ ను అరికట్టే గుణం ఉంటుందని చెబుతున్నారు.