Begin typing your search above and press return to search.

పింగళి కుటుంబాన్ని సత్కరించిన సీఎం వైఎస్ జగన్ !

By:  Tupaki Desk   |   12 March 2021 9:30 AM GMT
పింగళి కుటుంబాన్ని సత్కరించిన సీఎం వైఎస్ జగన్ !
X
భారత త్రివర్ణ పతాకం రూపొందించి వందేళ్లు పూర్తయింది. దీన్ని పురస్కరించుకొని జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్‌ కలిశారు. పింగళి వెంకయ్య కూతురు సీతామహాలక్ష్మిని సీఎం జగన్ సన్మానంచారు. ఆమెకు శాలువా కప్పటిం సత్కరంచారు. జాతీ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కానున్న సందర్భంంలో సన్మానించారు. మాచర్లలోని ఆమె నివాసానికి స్వయంగా చేరుకుని వారి యోగక్షేమాలను జగన్ వివరించారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.

ముఖ్యమంత్రి స్వయంగా తమ నివాసానికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు పింగళి జీవిత చరిత్ర పుస్తకం అందజేశారు. పింగళి కుటుంబంతో సీఎం జగన్ కాసేపు మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్‌' మహోత్సవ్‌' పేరిట కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ ‌లో గల సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. సబర్మతి ఆశ్రమం నుంచి నవసారిలోని దండి వరకు 81 మంది 241 మైళ్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. 25రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్ర ఏప్రిల్‌ 5న ముగియనుంది.

ఆ రోజున దండిలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం జగన్‌ ప్రారంభించారు. 75ఏళ్ల స్వాతంత్య్రం సంబరాలకు గుర్తుగా కేంద్రం 'అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమం చేపట్టింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి కానుంది.