Begin typing your search above and press return to search.

ఇద్దరు మంత్రులకి టీఆర్ ఎస్ హైకమాండ్ వార్నింగ్?

By:  Tupaki Desk   |   18 Aug 2020 3:30 PM GMT
ఇద్దరు మంత్రులకి టీఆర్ ఎస్ హైకమాండ్ వార్నింగ్?
X
పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు. వారే శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. ఈ ఇద్దరిలో నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఉన్నాడు. శ్రీనివాసగౌడ్ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇద్దరూ హైకమాండ్ కు చాలా దగ్గర.

అయితే జిల్లాలో ఈ మధ్య కొన్ని విషయాల్లో ఈ ఇద్దరు మంత్రులకు పడడం లేదు అని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాబోయే సీఎం అయిన కేటీఆర్ ఆ జిల్లాలో పర్యటిస్తే కేటీఆర్ ముందే వాళ్లు సరిగా మాట్లాడుకోవడం లేదు అని ఎమ్మెల్యేలకు ఈ ఇద్దరి మధ్య డివైడ్ అయ్యారని.. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిందట..

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం మంత్రుల కులాల పరంగా వీడిపోయారని తెలుసొచ్చిందట.. ఇలా అయితే టీఆర్ఎస్ ఇబ్బంది అవుతుందని.. టీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించి సర్దుకొని పోవాలని..లేకపోతే బాగుండదు అంటూ స్మూత్ గా మందలించారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.