Begin typing your search above and press return to search.

దేవాన్స్ ఖాతాలో 11 కోట్ల బ్లాక్ మనీ?

By:  Tupaki Desk   |   9 Nov 2016 10:16 AM GMT
దేవాన్స్ ఖాతాలో 11 కోట్ల బ్లాక్ మనీ?
X
ఏపీలో కేంద్ర ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేయడంలో దిట్ట ఎవరంటే చంద్రబాబు పేరు, మరో మీడియా కింగ్ పేరు వినిపిస్తాయి. ఇప్పుడు నల్లధనం నిరోధానికి ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనూ వారి పేర్లు మరోసారి వినిపిస్తున్నాయి. ప్రధాని చేపట్టిన ఈ మిషన్ ముందుగా తెలిసిన అతికొద్ది మందిలో వెంకయ్య నాయుడు ఒకరని... ఆయన ఈ విషయాన్ని చంద్రబాబుకు, మీడియా కింగ్ కు చెప్పడంతో వారు తమ బ్లాక్ మనీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

గత కొంత కాలంగా పదేపదే పెద్ద నోట్ల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద నోట్లు వద్దంటూ వీలుచిక్కినప్పుడల్లా చెప్పుకొస్తున్నారు. అంతే కాదు ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖలు కూడా రాసినట్టు చంద్రబాబు ప్రకటించడంతో ఆయన విషయం ముందే తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ నేతలూ దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. రూ. 500 - రూ. 1000 నోట్లు రద్దు కానున్నాయని ముందుగానే చంద్రబాబు కుటుంబానికి తెలుసునని కాంగ్రెస్ నేత - మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ నెల రోజుల క్రితమే 500 - 1000 రూపాయల నోట్లు రద్దు కానున్నాయని వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సంగతి అతనికెలా తెలుసునని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న సన్నిహితంతో, విషయాన్ని ముందే తెలుసుకుని తమ వద్ద ఉన్న కరెన్సీని లోకేష్ బృందం బ్యాంకుల్లోకి చేర్చుకుందని ఆరోపించారు. చంద్రబాబు మనవడి ఖాతాలోకి రూ. 11 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/