Begin typing your search above and press return to search.

సీఎం జగన్‌ను కలిసిన చినజీయర్ స్వామి .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   20 Nov 2021 6:30 AM GMT
సీఎం జగన్‌ను కలిసిన చినజీయర్ స్వామి .. ఎందుకంటే ?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామికి పాదాభివంద‌నం చేసి ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద్భంగా ఆయ‌న రాక‌కు భ‌క్తి తో పరవశించి సీఎం జ‌గన్ అయన పాదాలని తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యి సంవత్సరాలు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్ల లోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో సహస్రాబ్ది మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి. వీటి గురించి త్రిదండి చినజీయర్‌ స్వామి సీఎం జగన్ కి వివరించారు. ఈ నేపథ్యంలోనే, ఈ కార్యక్రమానికి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను ఈ సందర్భంగా ఆహ్వనించారు త్రిదండి చినజీయర్‌ స్వామి. ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. చినజీయర్‌ స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిశారు.