Begin typing your search above and press return to search.

అది ఫేక్ నమ్మకండి ...కేంద్రం స్పష్టికరణ !

By:  Tupaki Desk   |   15 April 2020 10:50 AM GMT
అది ఫేక్ నమ్మకండి ...కేంద్రం స్పష్టికరణ !
X
కరోనా వైరస్‌ పై ప్రపంచం యావత్తు పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కరోనా పై వస్తున్న నకిలీ వార్తలు - తప్పుదోవ పట్టించే సమాచారంపై మరో పోరాటం చేయాల్సి వస్తోంది. కష్టకాలంలో కొంతమంది సమాచారంతో జనాన్ని గందోరగోళానికి గురిచేస్తున్నారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఇలాంటి నకిలీ మెసేజ్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రతి భారతీయుడికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.15 వేలు ఇస్తున్నట్టు నకిలీ మెసేజ్‌ సృష్టించారు. అంతేకాదు డబ్బులు తీసుకోవాలంటే ఈ లింకుపై క్లిక్‌ చేసి - అందులోని దరఖాస్తును నింపాలని సూచించారు.

అయితే ఇది నకిలీ సమాచారం అని, ఈ లింక్‌ పై క్లిక్‌ చేయొద్దని ప్రెస్‌ ఇన్ ఫర్మేషన్‌ బ్యూరో సూచించింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని - మోసపోవద్దని పీఐబీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు - ఆన్‌ లైన్‌ మోసాలు ఎక్కువయ్యాయి. ఎండలో నిలుచుంటే కరోనా సోకదని కొద్దిరోజుల క్రితం ప్రచారం సాగింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. దీనికి ఎటువంటి ప్రయోగపూర్వక ఆధారం లేదని వివరణ ఇచ్చింది.