Begin typing your search above and press return to search.

జర ఆగండి : సెకండ్ వేవ్ తగ్గలే .. ముందుంది ముసళ్ల పండుగ !

By:  Tupaki Desk   |   10 July 2021 7:30 AM GMT
జర ఆగండి : సెకండ్ వేవ్ తగ్గలే .. ముందుంది ముసళ్ల పండుగ !
X
దేశంలో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ విజృంభణ తగ్గుముఖం పట్టగానే , చాలా రాష్ట్రాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌ డౌన్‌ ఎత్తేశారు. దీనితో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. కనీసం పేస్ మాస్కులు , భౌతిక దూరం కూడా పాటించడం లేదు. లాక్ డౌన్ ను తీసేస్తే కరోనా తగ్గినట్టు కాదు అని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిస్ట్‌ స్పాట్‌ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ట్రాఫిక్‌ లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్‌ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్‌ డిస్టెన్స్‌ , మాస్క్‌లు లేన్నోళ్లు ఎందరో.

ఈ తరుణంలో యూరో 2020 ప్రస్తావన తెరపైకి తీసుకువస్తూ , ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్‌ కోసం గేట్లు తెరిచింది లండన్‌ వాంబ్లే స్టేడియం. నాకౌట్‌ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్‌ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్‌ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్‌ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. దీనికి గల కారణం ఏంటి అంటే బ్యాక్‌ టు బ్యాక్‌ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. ఇంగ్లండ్‌ లో ఇప్పటికే 51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది.

ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్‌ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్‌ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. స్టేడియంలోకే కాదు,స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌ లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం అభిమానం మధ్య చివరి మ్యాచ్‌ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్‌, దీనితో ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. యూరో సాకర్‌ అభిమానులు సూపర్‌ స్పెడ్రర్లు గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇం‍గ్లండ్‌ ప్రభుత్వానికి సూచించింది.

మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యింది. సింగిల్‌ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి.యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు, మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి, జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. అసలు కరోనా రెండో వేవ్‌ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన, నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్‌ ఉధృతే అయిపోలేదు. కరోనా వైరస్ ప్రొటోకాల్‌ ను జాగ్రత్తగా పాటిస్తేనే బ్రతికి బట్ట కట్టగలం అని , పేస్ మాస్క్ , భౌతిక దూరం పాటించండి అని అంటున్నారు.