Begin typing your search above and press return to search.

యూకే వైరస్​ను తేలిగ్గా తీసిపారేయలేం.. సంచలన విషయాలు చెప్పిన సీసీఎంబీ డైరెక్టర్​

By:  Tupaki Desk   |   30 Dec 2020 2:30 PM GMT
యూకే వైరస్​ను తేలిగ్గా తీసిపారేయలేం.. సంచలన విషయాలు చెప్పిన సీసీఎంబీ డైరెక్టర్​
X
కొత్తగా వస్తున్న స్ట్రెయిన్​ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్​ భారత్​లోనూ వ్యాపించింది. ఇప్పటికే మనదేశంలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కేసులను కొత్త స్ట్రెయిన్ అయి ఉండొచ్చన్న అనుమానంతో కొందరి నమూనాలను పూణే లోని ల్యాబ్ కు పంపారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్​పై హైదరాబాద్​ సీసీఎంబీ డైరెకర్ట్​ రాకేశ్​ మిశ్రా పలు సంచలన విషయాలు వెల్లడించారు.

మనదేశంలో యూకే నుంచి వచ్చిన వ్యక్తుల శాంపిళ్లను సీసీఎంబీలో పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీసీఎంబీలో సుమారు నలభై శాంపిళ్లను పరీక్షించారు. అందులో కొన్నింటిలో కొత్త స్ట్రెయిన్​ను గుర్తించారు. అయితే సీసీఎంబీలో మొత్తం 40 శాంపిళ్లను పరీక్షించారు.
ఈ నేపథ్యంలో రాకేశ్​మిశ్రా కొత్త స్ట్రెయిన్​ ప్రభావం ఎలా ఉంటుంది. ఒకవేళ భారత్ లోకి కొత్త స్ట్రెయిన్​ వ్యాపిస్తే పరిస్థితులు ఏమిటి తదితర విషయాల గురించి చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ‘ కొత్త స్ట్రెయిన్​ డేంజర్​ ఏమీ కాదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాత కరోనా కంటే కొత్త స్ట్రెయిన్​ చాలా వేగంగా వ్యాపిస్తున్నది.

ప్రస్తుతం ఇంగ్లాండ్​లో బయటపడుతున్న కేసుల్లో 60 శాతం కొత్త కేసులే నమోదవుతున్నాయి. కొత్త స్ట్రెయిన్​ వ్యాప్తి చెందితే.. ఆస్పత్రులు కూడా సరిపోవు. ఇప్పటికే బ్రిటన్​లో లాక్​డౌన్​ విధించారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఒక నెలరోజులపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈ కొత్త స్ట్రెయిన్​నుంచి బయటపడొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.