Begin typing your search above and press return to search.

మాజీ హోం మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు..!

By:  Tupaki Desk   |   24 April 2021 9:30 AM GMT
మాజీ హోం మంత్రి  ఇంట్లో సీబీఐ సోదాలు..!
X
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయన నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇటీవలే అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖేశ్​ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్ సచిన్​ వాజేను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ముఖేశ్​ అంబానీపై బెదిరింపులకు దిగిన వారిలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మాజీ పోలీస్ అధికారి పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అనిల్​ దేశ్​ముఖ్​ పెద్ద అవినీతి పరుడని పరమ్​ బీర్​ సింగ్​ ఆరోపించారు. ఆయన ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ విధించారని ఆరోపించారు. ఈ మేరకు నేరుగా సీఎం ఉద్దవ్​ థాక్రేకు ఆయన లేఖ రాశారు. ఈ లేఖ వైరల్​గా మారింది. అవినీతి ఆరోపణలతో అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవికి రాజనామా చేశారు. ప్రస్తుతం ఆయనపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా .. ముఖేశ్​ అంబానీ బెదిరింపుల కేసు రోజుకో ట్విస్ట్​ తీసుకుంటున్నది. ముంబై, నాగ్‌పూర్‌లోని అనిల్ దేశ్‌ముఖ్ ఇళ్లతో సహా నాలుగు చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.ముంబై మాజీ టాప్ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అవినీతి కేసు నమోదు చేయవచ్చో లేదో నిర్ణయించడానికి సీబీఐకి 15 రోజుల సమయం ఇచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అనిల్ దేశ్ ముఖ్, ఇంకా పలువురిపై ఏప్రిల్ 6 న ప్రాథమిక విచారణను పూర్తి చేసింది. అనిల్​ దేశ్​ముఖ్​.. ఎన్​ కౌంటర్​ స్పెషలిస్ట్​ సచిన్​ వాదే ఎన్నో అవినీతి పనులు చేసినట్టు విచారణలో వెల్లడైంది.