Begin typing your search above and press return to search.

జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9మంది మృతి

By:  Tupaki Desk   |   11 Dec 2021 8:43 AM GMT
జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9మంది మృతి
X
ఆంధ్రప్రదేశ్ లో బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది.ఇప్పటికే ఉత్తరాంధ్రలోని అరకులో చోటుచేసుకున్న బస్సు ప్రమాదాన్ని మరిచిపోకముందే తాజాగా మరో ఉపద్రవం చోటుచేసుకుంది. ఈసారి బస్సుప్రమాదంలో 9మంది మృతి చెందారు. ఈ ఘోర దుర్ఘటన విషాదం నింపింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరువాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ తో సహా 9మంది ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.బస్సు బయటకు వస్తే గాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు.