Begin typing your search above and press return to search.

ఢిల్లీ బీఆర్ఎస్ కోసం కేసీఆర్ రెండు రోజుల యాగం

By:  Tupaki Desk   |   11 Dec 2022 4:12 PM GMT
ఢిల్లీ బీఆర్ఎస్ కోసం కేసీఆర్ రెండు రోజుల యాగం
X
ఏది మొదలుపెట్టాలన్నా కూడా కేసీఆర్ ముహూర్తాలు చూసుకుంటారు. అలాగే యజ్ఞయాగాలు చేస్తారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఇలానే చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదలుపెట్టిన వేళ కూడా మళ్లీ సెంటిమెంట్ బాటపట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో కేసీఆర్ మరో యాగాన్ని చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించేందుకు అదే రోజు ముహూర్తం ఖరారు చేశారు. 13,14 తేదీల్లో మంచి ముహూర్తం ఉందన్న కేీసఆర్.. 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ కోసం రెండు తేదీల్లో యాగం నిర్వహించతలపెట్టారు కేసీఆర్.

బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముందుకెళ్లాలన్న అభీష్టంతో ఢిల్లీ పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ స్వయంగా ఇందులో పాల్గొననున్నారు. ఇందుకోసం సోమవారం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు.

కేసీఆర్ కు యాగాలు బాగా కలిసి వచ్చాయి. తెలంగాణ వచ్చింది.. సీఎం కూడా అయ్యారు. యాగాలపై దైవంపై పూర్తి విశ్వాసం మంచి నమ్మకం కేసీఆర్ కు ఉంది. తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలంటూ చంఢీయాగాన్ని కేసీఆర్ నిర్వహించారు. ఇక రెండో దఫా ఎన్నికలకు వెళ్లేముందు ఫామ్ హౌస్ లో రాజ శ్యామల యాగాన్ని నిర్వహించారు. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ విజయవంతం కావాలన్న అభీష్టంతోనే ఢిల్లీ బీఆర్ఎస్ కొత్త పార్టీ కార్యాలయంలో ఈ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ తోపాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి చేసుకుంటున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశానికి ఏర్పాట్లు చకచకగా జరిగాయి.