Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ దాడులు

By:  Tupaki Desk   |   27 Feb 2020 7:00 AM GMT
బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ దాడులు
X
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల పై ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గురువారం ప్రభుత్వ ఆస్పత్రులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దాడులలో 13 టీములు, 100 మంది అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్పత్రుల అక్రమాలు వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చంద్రబాబు హయాం నుంచి మందుల కొనుగోలులో చేతివాటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఇప్పటికీ అవి కొనసాగుతున్నట్టు తేలింది. పలు రిక్రూట్ మెంట్లకు సంబంధించిన అవకతవకలు జరిగినట్టు తెలిసింది. ఇక ఆస్పత్రుల పరికరాల కొనుగోలు విషయంలో కూడా గోల్ మాల్ జరిగినట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో సీఎం జగన్ ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులకు దిగారు. ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులను రంగంలోకి దించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. అరెస్టులు ఉండవచ్చని సమాచారం అందుతోంది.

మొదట రవాణా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఆ శాఖలోని అవినీతిని ఏరిపారేశారు. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ‘దివాకర్ ట్రావెల్స్’ ఆటకట్టించారు.అక్రమంగా తిరుగుతున్న బస్సులను సీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఇక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యాపారాలను బయటపెట్టి సంచలనం రేపారు. ఈ ట్రాక్ రికార్డ్ చూసే జగన్ ఏపీలో అవినీతి ని ఏరివేసే పెద్ద బాధ్యతను అప్పజెప్పారు. ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ సహా ఆర్టీవో, ట్రావెల్స్ శాఖలపై దాడులు చేసిన ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అక్రమాలపై పడడం ఏపీ ప్రభుత్వ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎవరి మీద పడుతారో తెలియక భయంతో ప్రభుత్వ అధికారులు టెన్షన్ పడుతున్నారు.