Begin typing your search above and press return to search.

ఏపీ బడ్జెట్​ సమావేశాలకు బ్రేక్​

By:  Tupaki Desk   |   18 March 2021 2:36 AM GMT
ఏపీ బడ్జెట్​ సమావేశాలకు బ్రేక్​
X
ఏపీ బడ్జెట్​ సమావేశాలు వాయిదా వేయబోతున్నట్టు సమాచారం. నిజానికి మార్చి 19 నుంచి బడ్జెట్​ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే తిరుపతి పార్లమెంట్​ ఉప ఎన్నికకు షెడ్యూల్​ విడుదల కావడంతో బడ్జెట్ సమావేశాలకు బ్రేక్​ పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉండటంతో బడ్జెట్​ సమావేశాలు వాయిదా వేయాలని సీఎం జగన్​ నిర్ణయించుకున్నట్టు సమాచారం. తిరుపతి పార్లమెంట్​ సీటుకు ఉప ఎన్నికల నేపథ్యంలో మార్చి 23 నుంచి మే 2 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్​ సమావేశాలను వాయిదా వేయాలని సీఎం జగన్​ నిర్ణయించారు.

ఈ మేరకు బుధవారం సీఎం .. స్పీకర్​ తమ్మినేని సీతారాం , కౌన్సిల్​ చైర్మన్​ ఎంఏ షరీఫ్​, ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్నికల కోడ్​ ముగిసిన అనంతరం పరిపాలనా రాజధానికి విశాఖపట్టణాన్ని చేయాలని సీఎం జగన్​ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరోవైపు తిరుపతి పార్లమెంట్​కు వైసీసీ అభ్యర్థి గా ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్​ గురుమూర్తిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.

గురువారం ఆయన తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్​ రెడ్డి ని కలుసుకున్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన సీఎం జగన్​మోహన్​రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురుమూర్తి సీఎం జగన్​ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్​ పాదయాత్ర చేసినప్పుడు గురుమూర్తి ఆయన వెంటే ఉన్నారు. సీఎం జగన్​ ఆరోగ్య పరమైన సలహాలు సూచనలు అందించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఈ అవకాశం దక్కింది.