Begin typing your search above and press return to search.

బాబు దోపిడీ కథను విప్పిన బొత్స

By:  Tupaki Desk   |   26 Feb 2020 9:15 AM GMT
బాబు దోపిడీ కథను విప్పిన బొత్స
X
విజయనగరం బిడ్డ, మంత్రి బొత్స సత్యనారాయణ ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాటాడేస్తుంటారు. ఏదీ దాచుకోడు. మనసులో ఏదీ పెట్టుకోడు. అందుకే చంద్రబాబుపై దాడికి బొత్సనే ప్రిఫర్ చేస్తుంటుంది వైసీపీ అధిష్టానం. వైఎస్ హయాం నుంచి పనిచేస్తున్న బొత్స అయితే బాగా కడిగేస్తుంటాడని..

తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీలా దోచుకోవడానికి కాదని.. పేదల కోసం భూసేకరణ సమీకరణ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. పేదలకు భూములు , ఇళ్ల స్థలాలు పంచేందుకు భూసేకరణ ను జిల్లాల్లో చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబు, టీడీపీ నాయకులు జిల్లాలకు వస్తే ఎలా దోచుకున్నారో ప్రజలు చెబుతారని మంత్రి బొత్స తెలిపారు. బాబు వస్తే టీడీపీకి ఉన్న విలువ కూడా పోతుందని బొత్స తూర్పారపట్టారు.

తమ ముఖ్యమంత్రి జగన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నాడని.. భూసేకరణలో ప్రజలు అసంతృప్తి గా ఉంటే ఒక రూపాయి ఎక్కువ ఇమ్మన్నారని పేర్కొన్నారు. మీలాగా దోపిడీ బ్యాచ్ మాది కాదని టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స నిప్పులు చెరిగారు.