Begin typing your search above and press return to search.

మోడీకి వైసీపీ, టీడీపీ ఇద్దరూ దండాలో దండాలు?

By:  Tupaki Desk   |   6 Aug 2020 11:30 AM GMT
మోడీకి వైసీపీ, టీడీపీ ఇద్దరూ దండాలో దండాలు?
X
ఇంతటి కరోనా లాక్ డౌన్ తో దేశంలోని ప్రజలంతా ఉద్యోగ ఉపాధి కోల్పోతే వారికే ఏమీ ఇవ్వని మోడీజీ.. రాజధాని కూడా లేని ఏపీకి ఏం ఇస్తాడని ఇక్కడి నేతలు భజన చేస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ ఎవరికీ విదిల్చే రకం కాదని.. ఏపీలోని రెండు పార్టీలు ఎందుకు ఆయనకు భయపడుతున్నాయని ప్రశ్నిస్తున్నాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాకు మోడీ టచ్ లో ఉన్నాడని ప్రచారం చేసుకుంటున్నాడు.. నాతో మాట్లాడుతున్నాడు అని బిల్డప్ ఇచ్చేస్తున్నాడు.. ఇక వైసీపీ వాళ్లు మేము మోడీకి ప్రతిది అప్ డేట్ చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నారు.. అసలు రెండు పార్టీల వాళ్లు మోడీకి ఎందుకు దండాలు పెట్టాలి? రాష్ట్రానికి మోడీ ఏమీ చేశాడని..? ఎందుకు భయపడాలని మేధావులు అంటున్నారు.

మన రాష్ట్రానికి చెందిన జీఎస్టీ డబ్బులు తీసుకొని వెళ్లి వాళ్లకు అనుకూలమైన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఇస్తున్నాడని.. మనం ఎందుకు మోడీకి రెస్పెక్ట్ ఇవ్వాలని మేధావులు హితవు పలుకుతున్నారు.

ఏపీ విభజన బిల్లులో ఇచ్చిన హామీలేవి మోడీ సర్కార్ నెరవేర్చలేదు. లోటు బడ్జెట్ తో విడిపోయిన ఆంధ్రా రాష్ట్రానికి బడ్జెట్ లో కనీసం నిధులు కేటాయించలేదు. కానీ ఏపీలో ఉన్న రెండు పార్టీలు మాత్రం మోడీకి సాష్టాంగ నమస్కారం పెట్టడానికి రెడీగా ఉండడం ఏంటి అని మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.