Begin typing your search above and press return to search.

తమ్ముళ్లతో జగన్ బ్యాచ్ ఫుల్ టచ్ లో ఉన్నారట

By:  Tupaki Desk   |   31 March 2016 7:23 AM GMT
తమ్ముళ్లతో జగన్ బ్యాచ్ ఫుల్ టచ్ లో ఉన్నారట
X
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీ అధికారపక్షంలో భాగస్వామ్యం అయ్యేందుకు విపక్ష నేత జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు తమతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు వచ్చిన విషయం తెలిసిందేనని.. రానున్న రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు రావటం ఖాయమన్న మాటను చెప్పుకొచ్చారు.

ఏపీలో చంద్రబాబు సర్కారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని చూసి ఆకర్షితులైన విపక్ష నేతలు సైకిల్ ఎక్కటానికి విపరీతమైన ఆత్రుతను ప్రదర్శిస్తున్నట్లుగా బొండా ఉమ చెప్పుకొచ్చారు. జగన్ బ్యాచ్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న ఆయన.. వారి పేర్లను వెల్లడించలేదు. కాకుంటే.. రేపు (ఏప్రిల్ 1)న జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇప్పటికే కిందామీదా పడుతున్న ఏపీ విపక్షానికి రానున్న రోజుల్లో మరిన్ని చేదు అనుభవాలు తప్పేటట్లు లేదు.