Begin typing your search above and press return to search.

22 ఏళ్ల వ‌య‌సులో జ‌గ‌న్ ఆ ప‌ని చేశాడా?

By:  Tupaki Desk   |   14 March 2016 11:36 AM GMT
22 ఏళ్ల వ‌య‌సులో జ‌గ‌న్ ఆ ప‌ని చేశాడా?
X
ఏపీ అసెంబ్లీ హాట్ హాట్ గా సాగుతోంది. చంద్ర‌బాబు స‌ర్కారు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అధికార‌.. విప‌క్ష నేత‌ల మ‌ధ్య హాట్ హాట్ గా వాద ప్ర‌తివాదాలు సాగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం.. కొన్ని సంద‌ర్భాల్లో వ్య‌క్తిగ‌త స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్న ప‌రిస్థితి.

అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా సాగుతున్న చ‌ర్చ‌లో భాగంగా ఏపీ అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై ప‌లుమార్లు విమ‌ర్శ‌లు చేశారు.అయితే.. వీరంద‌రిలోకి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో.. స‌భ‌లో పెద్ద ఎత్తున గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.

జ‌గ‌న్ ది మొద‌టి నుంచి నేర‌చ‌రిత్రేన‌ని బొండా ఉమ ఆరోపించటం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ త‌న 22 ఏళ్ల వ‌య‌సులోనే క‌డ‌ప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేష‌న్ పై దాడి చేశార‌ని.. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌పై చేయి చేసుకున్నార‌ని ఉమ ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాల్ని ఆయ‌న ప్ర‌ద‌ర్శించారు. చిన్న వ‌య‌సులోనే పోలీస్ స్టేష‌న్ మీద దాడి చేసిన జ‌గ‌న్‌.. ఆ మ‌ధ్య తునిలో జ‌రిగిన కాపు ఐక్య గ‌ర్జ‌న‌లో విధ్వంసానికి కూడా జ‌గ‌న్ త‌న సొంత ప్రాంత‌మైన పులివెందుల నుంచి వ‌చ్చిన రౌడీలే కార‌ణమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బొండా ఉమ చేసిన వ్యాఖ్య‌ల‌తో విప‌క్ష నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మొత్తంగా జ‌గ‌న్‌ కు సంబంధించి బొండా ఉమ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.