Begin typing your search above and press return to search.

గోహంతకులు ఎవరైనా సరే చంపేస్తా!!

By:  Tupaki Desk   |   8 May 2017 7:38 AM GMT
గోహంతకులు ఎవరైనా సరే చంపేస్తా!!
X
తెలుగు రాష్ర్టాల్లో కరడుగట్టిన హిందూ భావజాలం గల ఎమ్మెల్యేగా.. గోరక్షక వాదిగా పేరున్న వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే, హైదరాబాద్ లోని గోషా మహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ లోధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోహత్య చేస్తే ఎవరినైనా చంపేస్తానని అన్నారు. అంతేకాదు.. హైదరాబాదులోని ఓల్డ్ సిటీ భారత్ లో భాగం కాదని, అది మినీ పాకిస్థాన్ అని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎక్కడ టెర్రరిస్టు దొరికినా అతని మూలాలు హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో ఉంటాయని అన్నారు. ఎంఐఎం ఆఫీసు పైన టెర్రరిస్టులు నివాసం ఉంటారని ఆయన ఆరోపించారు. దేశంలో టెర్రరిజం నడవడానికి కారణం ఓల్డ్ సిటీలో రాజకీయం చేసే రెండు పార్టీలేనని ఆయన చెప్పారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాత బస్తీలో ఆశ్రయం ఇస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

వందేమాతరం, భారత్ మాతాకీ జై అనని వారి మెడపై కత్తిపెట్టి వారితో ఆ నినాదాలు పలికిస్తామని ఆయన చెప్పారు. అలాగే ప్రైవేటు సైన్యాన్ని తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనపై వెయ్యి కేసులు వేసినా, ఉరి శిక్ష వేసినా భయపడేది లేదని ఆయన చెప్పారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/