Begin typing your search above and press return to search.

20 లక్షలకు బీజేపీలో నామినేటెడ్ పందేరం..

By:  Tupaki Desk   |   16 Feb 2020 5:44 PM IST
20 లక్షలకు బీజేపీలో నామినేటెడ్ పందేరం..
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర స్థాయిలోని కీలక నేతలకు పదవులు కట్టబెట్టడుతోంది. వివిధ నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల చిచ్చు రేగింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగినట్టైంది.

బీజేపీ తరుఫున నామినేటెడ్ పోస్టు ఇప్సిస్తానంటూ రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి రెడ్డిపై బీజేపీ యువ మోర్చా సెక్రెటరీ బొక్కా బాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం బీజేపీలో తీవ్ర కలకలం రేపింది.

స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ పోస్టును ఇప్పిస్తానని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి రెడ్డి ఏకంగా 38 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సదురు మహిళా బీజేపీ నేతపై చీటింగ్ కేసును నమోదు చేశారు.