Begin typing your search above and press return to search.

టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసు

By:  Tupaki Desk   |   22 Oct 2020 3:30 PM GMT
టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసు
X
టీడీపీ నేతలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి తీవ్రస్థాయి లో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీది ముగిసిపోయిన అధ్యాయం అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘టీడీపీలో కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు మాకు సలహాలిస్తున్నారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారంటూ విమర్శలు కురిపించారు.

బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని , తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ను దాటి తెలంగాణ చేరింది. బీజేపీకి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదని గట్టిగా చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 40 ఆలయాలు కూల్చేశారు. ఇక మా భుజాల మీద మిమ్మల్ని మోసే శక్తిలేదు. బీజేపీది రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర. పూటకోమాట మాట్లాడే తీరు టీడీపీ నాయకులది అంటూ ఆరోపణలు చేశారు. మీ పార్టీ ఏపీ దాటిపోయి తెలంగాణ చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ‌లో ఉంటూ హైదరాబాద్ వరదలపై నోరు మెదపని నాయకుడు చంద్రబాబు. దోచేసి రెస్ట్ తీసుకుని బయటకు వచ్చిన నాయకుడు ఆయన. బీజేపీకి ఉచిత సలహాలు సూచనలు అవసరం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే , 50 వేల ఖరీదు చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా మమ్మలి విమర్శిస్తున్నారు. స్క్రోలింగ్ వీరుడు మరొకరు ఉదయం అరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు. మరొకరు తానే మేధావి అన్నట్లు మాట్లాడుతారు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. మొత్తంగా విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ అధినేత పై , నేతలపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.