Begin typing your search above and press return to search.

ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇలా బుక్ అయ్యారే

By:  Tupaki Desk   |   20 Feb 2016 4:49 AM GMT
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇలా బుక్ అయ్యారే
X
ప్రముఖ పారిశ్రామికవేత్తలకు శుక్రవారం రాత్రి ఊహించని షాక్ తగిలింది. పెద్ద పెద్ద వ్యాపారాల్ని నిర్వహించే బిజినెస్ మ్యాన్లు అడ్డంగా దొరికిపోయారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ వ్యవహారం సంచలనం సృష్టించిన పరిస్థితి. పెద్దపెద్ద వ్యాపార సంస్థల అధిపతులైన పలువురు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇలా బుక్ అయినోళ్లు ఎవరో ఒకరు కాకుండా పలువురు మీద కేసులు బుక్ కావటం విశేషం. మోతాదుకు మించిన మద్యం సేవించి.. వాహనాలు నడుపుతున్న కేసులో ఈ బిజినెస్ మ్యాగ్ నెట్లు బుక్ కావటం గమనార్హం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో తాజాగా బుక్ అయిన పారిశ్రామికవేత్తలు చూస్తే.. బీఈ (బయోలాజికల్ ఈవెన్స్) చీఫ్ నరేందర్.. జేపీ ఇండస్ట్రీస్ యజమాని జేపీ రెడ్డి.. వీఎస్ ఇంజనీరింగ్ కు చెందిన హరి.. సూర్యలతా స్పిన్నింగ్ మిల్స్ మహేందర్ లు పోలీసులకు దొరికిపోయారు.

అత్యంత ఖరీదైన వాహనాల్ని నడుపుతూ.. పోలీసుల తనిఖీల్లో దొరికి బుక్ అయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయిన ప్రముఖుల కార్లతో పాటు.. మరికొందరి వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో బుక్ అయిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. కోర్టులో హాజరు పరుస్తారని చెబుతున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి.. తాగి వాహనం నడిపితే బుక్ అవుతామన్న ఆలోచన లేకపోవటం ఏమిటి సిత్రంగా..?