Begin typing your search above and press return to search.

కరోనాపై కేసీఆర్ కు మంచి ఐడియా ఇచ్చిన బండి సంజయ్

By:  Tupaki Desk   |   24 March 2020 12:30 PM GMT
కరోనాపై కేసీఆర్ కు మంచి ఐడియా ఇచ్చిన బండి సంజయ్
X
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడం తో సీఎం కేసీఆర్ వేగంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కరోనా వైరస్ పై సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ లేఖ రాశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ బీజేపీ తరుఫున ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని మద్దతు తెలిపారు.

రాష్ట్రంలో లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనాపై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ప్రతీ బీజేపీ కార్యకర్త కరోనాపై సేవకుడి పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ ను కేంద్రం ఆయుష్మాన్ భారత్ లో చేర్చిందని.. తెలంగాణలో కూడా ఈ పథకం అమలు చేయాలని బండి సంజయ్ లేఖలో సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

ఇక రాష్ట్రంలో కరోనా ఎక్కువైతే హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాలను కూడా ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించుకోవాలని బండి సంజయ్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేసి సీఎం కేసీఆర్ కు కరోనాను తెలంగాణలో ఎదుర్కోవడంపై తమ పూర్తి మద్దతు ఉంటుందని.. బీజేపీ తరుఫున బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.