Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఆసక్తికర సీన్..కామెడీ డైలాగ్ తో నవ్వించిన బాలయ్య!

By:  Tupaki Desk   |   19 Jun 2020 2:00 PM IST
అసెంబ్లీలో ఆసక్తికర సీన్..కామెడీ డైలాగ్ తో నవ్వించిన బాలయ్య!
X
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలక్రిష్ణ శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరికీ నవ్వులు పూయించింది.

రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలయ్య కూడా ఓటు వేశారు. బాలయ్య ఓటు వేసి బయటకు నడుచుకుంటూ వస్తుండగా అసెంబ్లీ ఆవరణలో పక్కనే ఉన్న ఒక కుక్క మొరిగింది.

తనను చూసి మొరిగిన కుక్కను చూసి బాలయ్య వ్యంగ్యంగా ఓ డైలాగ్ చెప్పారు. ‘తాము అరిచేవాళ్లం కాదు.. కరిచేవాళ్లం’ అంటూ సినిమాటిక్ డైలాగ్ చెప్పారు. మనం కూడా కుక్క భాషలో మాట్లాడాలని అన్నారు. దీంతో పక్కనే ఉన్నవారంతా ఫక్కున పెద్దగా నవ్వారు. బాలయ్య బాబు సినిమాల్లోనే కాదు.. బయట కూడా డైలాగ్ లతో చంపేస్తాడు అంటూ సెటైర్లు వేసుకున్నారు.

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరుఫున మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి, పరిమిళ్ నత్వాని బరిలోకి దిగారు. టీడీపీ తరుఫున వర్ల రామయ్య పోటీచేస్తున్నారు.