Begin typing your search above and press return to search.

వేల మెజార్టీ ఎంట్రా: బాలయ్య నిర్వేదం

By:  Tupaki Desk   |   4 April 2019 11:40 AM IST
వేల మెజార్టీ ఎంట్రా: బాలయ్య నిర్వేదం
X
బాలయ్య కు హిందూపురంలో గెలుపుపై ఆశల్లేవా.? వేల మెజార్టీ అని అభిమానులు హోరెత్తిస్తున్నా.. అంత వస్తుందా అని అనుమానాలు పడడం దేని సంకేతం.?. తాజాగా బాలయ్య పోటీచేస్తున్న హిందూపురంలో భార్య వసుంధరతో కలిసి రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు పోటెత్తారు.

రోడ్ షోలో బాలయ్యకు 50 - 60 -70 - 80 వేల మెజార్టీ హిందూపురంలో వస్తుందంటూ అభిమానులు పేర్కొంటుంటే.. బాలయ్య మాత్రం అంత మెజార్టీ వస్తుందారా అంటూ ఈసడించుకున్నారు.. ‘నా కొడుకా అంత మెజార్టీ రాకపోతే ఏసిపాడదొబ్బుతా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇలా వేలు - లక్షలు మెజార్టీ వస్తుందంటూ తనను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఇలాంటి వారి పీక కోయాలంటూ సైగలు చేస్తూ భార్య వసుంధరతో బాలయ్య చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు కనుక అంత మెజార్టీ రాలేదనుకో.. నీ పేరు - అడ్రస్ చెప్పరా.. గెలవకపోతే పీక కోస్తా.. ఏసీ పాడదొబ్బుతా అంటూ టీడీపీ కార్యకర్తపై బాలయ్య వ్యాఖ్యానాలు చేయడం వీడియోలో కనిపించింది.

ఇలా బాలయ్యకు కూడా తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అంత మెజార్టీ వస్తుందని ఆశలు లేనట్టు వీడియో ద్వారా తేటతెల్లమవుతోంది. గెలుస్తాం కానీ అంత మెజార్టీ వచ్చేలా లేదంటూ బాలయ్య పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.