Begin typing your search above and press return to search.

27 ఏళ్లకు నెలలు నిండాయి.. బిడ్డకోసం సుధీర్ఘ నిరీక్షణ ..!

By:  Tupaki Desk   |   5 Dec 2020 2:30 AM GMT
27 ఏళ్లకు నెలలు నిండాయి.. బిడ్డకోసం సుధీర్ఘ నిరీక్షణ ..!
X
తొమ్మిది నెలలు పూర్తయ్యాక ప్రసవం జరగడం సాధారణ విషయమే. కాకపోతే ఓ నెల అటో ఇటో అవుతుంది. కానీ ఓ బిడ్డ పుట్టేందుకు దాదాపు 27 ఏళ్లపాటు పట్టింది. గర్భస్థ పిండం 27 ఏళ్ల తర్వాత బిడ్డగా రూపాంతరం చెందింది. నిజానికి వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం. ఆ బిడ్డకోసం 27 ఏళ్లు నిరీక్షించాల్సి ఎందుకు వచ్చిందో.. ఇంత సుధీర్ఘ కాలం తర్వాత ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందో తెలుసుకుందాం. మోలీ అనే పసికందు ఈ ఏడాది అక్టోబర్​లో జన్మించింది. కానీ ఆమె గర్భస్థ పిండం మాత్రం 1992లో ఏర్పడింది. ఆ పిండాన్ని ఇన్నేళ్లపాటు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంచారు.

అమెరికాలోని టేనస్సీకి చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతుల ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డుకెక్కారు, ఈ అరుదైన పద్ధతిలో జన్మించిన రెండో బిడ్డగా మోలీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆమె సోదరి ఎమ్మా పేరు మీద ఉంది. ఎందుకంటే తాను కూడా గడ్డకట్టించిన పిండం నుంచే జన్మించింది.

అమెరికాలో ‘ఎంబ్రోయో డొనేషన్​’ అనే విధానం అమల్లో ఉంది. ‘ఎంబ్రోయో డొనేషన్ ప్రకారం తల్లిదండ్రులు గర్భస్తపిండాలను దత్తత తీసుకోవచ్చు. తమ వద్ద గడ్డకట్టిన స్థితిలో ఉన్న గర్భస్థ పిండాలను వైద్యులు సదరు తల్లిదండ్రులకు అందిస్తారు. వారు ఈ పిల్లలను పెంచుకుంటారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంది. ఎట్టకేలకు ఆమె ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది.

ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ (ఎన్‌ఈడీసీ) అనే సామాజిక సంస్థ.. పిండాలను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతుంది. ఎవరికైనా సంతానం అవసరమైతే.. ఆ పిండాలను దానమిస్తుంది. చాలామంది జంటలు ఇలా ఎంబ్రోయే డొనేషన్​ చేస్తారు. అంటే తాము పిల్లలను కనకుండా గర్భస్థ పిండాలను దానం ఇస్తారు,. ఈ గర్భస్థ పిండాలను గడ్డగట్టిన స్థితిలో నిలువ ఉంచి కొద్ది రోజుల తర్వాత ఎవరైనా కోరితే బిడ్డగా మారుస్తారు. ఈ అరుదైన విధానం అమెరికాలో అందుబాటులో ఉన్నది. నిజానికి ఇది చాలా కష్టతరమైన పని. అంతేకాక ఖర్చుతో కూడుకున్నది కూడా.