Begin typing your search above and press return to search.

క‌రోనా గురించి భ‌యంక‌ర నిజం.. ఇక‌.. మ‌న ఇష్టం!

By:  Tupaki Desk   |   16 April 2021 2:33 PM GMT
క‌రోనా గురించి భ‌యంక‌ర నిజం.. ఇక‌.. మ‌న ఇష్టం!
X
క‌రోనా సెకండ్ వేవ్‌.. దేశాన్ని కుదిపేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మ‌న‌కురాదులే.. మ‌నం చాలా ఆరోగ్యంగా ఉ న్నాంలే.. అని అనుకుంటున్నారా? అయితే.. క‌రోనా వ‌ల్ల‌.. ఇప్ప‌టి వ‌ర‌కుఉన్న ముప్పు, ల‌క్ష‌ణాల‌తోపాటు.. ఇప్పుడు తాజాగా ఒక భ‌య‌క‌ర‌మైన నిజం బ‌ట్ట‌బయ‌‌లైంది. క‌రోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు అధికంగా ఉందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే వైరస్ బారిన పడ్డవారిలో నే ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బయటపడింది.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.. పలువురు కొవిడ్ వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నవారిని, కరోనా బాధి తులను రెండు వారాలపాటు పరీక్షిస్తూ వచ్చారు. వీరిలో ఎంతమంది 'మెదడు సిరల్లో రక్తం గడ్డకట్టడం (సీవీటీ)'తో బాధపడుతున్నార‌ని విశ్లేషించారు. కొవిడ్ బాధితుల్లో సీవీటీ సాధారణంగానే తలెత్తుతోందని, ఇలాంటి వారిలో 30% మంది 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారని పరిశోధకులు తేల్చారు. టీకా తీసుకున్న తర్వాత పరిస్థితితో పోల్చితే .. కొవిడ్ కారణంగానే 8-10 రెట్లు అధికంగా సీవీటీ ముప్పు పొంచి ఉందని వారు కనుగొన్నారు.

'కొన్ని కొవిడ్ వ్యాక్సిన్ల కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టే ముప్పు ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు వాటి వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల కంటే కొవిడ్ కారణంగానే సీవీటీ ముప్పు తీవ్రంగా ఉంటోంది. టీకా వల్ల లాభ నష్టాలను అంచనా వేసుకునేటప్పుడు దీన్ని గమనంలోకి తీసుకోవాలి. రక్తం గడ్డకట్టడానికి ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్లు, ఒకే తీరులో కారణమవుతున్నాయా? అన్న విషయమై లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉంది' అని పరిశోధనకర్త పాల్ హారిసన్ పేర్కొన్నారు. మొత్తానికి.. క‌రోనాతో తుమ్ములు, జ్వ‌రం మాత్ర‌మే వ‌స్తుంద‌ని.. అనుకున్న‌వారికి ఈ ప‌రిశోధ‌న‌లు షాకిస్తున్నాయి. మ‌రి కరోనా నుంచి మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి అంతా మ‌న‌చేతుల్లోనే ఉంది. క‌రోనా రాకుండా చూసుకుందామా? వ‌చ్చాక‌.. చేతులు ఎత్తేద్దామా?!