Begin typing your search above and press return to search.

అఖిలప్రియ అంతమే నా పంతం?

By:  Tupaki Desk   |   16 Jun 2020 12:30 PM GMT
అఖిలప్రియ అంతమే నా పంతం?
X
టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య చంపుకునేంత వైరం ఉందని తాజాగా మరోసారి వెల్లడైంది.. ఇద్దరు నాయకులు గతంలో కూడా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో భీకరంగా రాజకీయ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పార్టీ మరియు ఎన్నికల ప్రయోజనాల విషయంలో కొంత రాజీపడ్డారు. అధికారంలో ఉండడంతో సదురు నేతలు కొంత సంయమనం పాటించారు.

2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియల మధ్యనున్న విభేదాలు భగ్గుమన్నాయి. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ ఇద్దరూ కలిసి తన హత్యకు కుట్రపన్నారని.. రూ.50 లక్షల సుపారీ ఇచ్చారని సుబ్బారెడ్డి ఆరోపించడం కలకలం రేగింది.

అయితే ఈ ఆరోపణలపై అఖిల ప్రియ స్పందించింది. సుబ్బారెడ్డి తీవ్రమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అతడి వెనుక వైసీపీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు అఖిల ఆరోపించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏవీ సుబ్బారెడ్డి సంచలన విషయం వెల్లడించాడు. తన ప్రాణాలు తీయాలనుకున్న అఖిలిప్రియ మర్డర్ ప్లాన్ చేశానని.. అది మీకు ఎలా తెలిసిందని ఎదురు ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఇంతవరకు ఎవరూ తనను ఈ ప్రశ్న అడగలేదని.. ఇది వాస్తవం అని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అఖిలప్రియ మొఖం చూసినా దరిద్రమేనన్నారు.

చంద్రబాబు నాకు, అఖిలప్రియకు మధ్య సయోధ్య కుదుర్చి నాడు హెచ్చరించాడని.. కానీ ఇప్పటికీ అఖిలప్రియ తనను చంపడానికి హత్యాప్రయత్నం ఎందుకు చేస్తుందో తెలియదు అని ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఖిలప్రియ రాజకీయ అంతమే తన పంతం అని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు తేల్చుకోమంటే ఖచ్చితంగా అఖిలప్రియతో తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అఖిలప్రియ ఏపార్టీలో ఉన్నది అన్నది తనకు అనవసరమని.. ఆమె ఎదుగుదల లేకుండా చేస్తానన్నా ఆమెను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. తన ఎదుగుదల లేకున్నా వారిని ఎదగనీయనని ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించాడు.