Begin typing your search above and press return to search.

ఇలాంటి వారి వెనుక ఎవరూ ఉండరు-అశ్వనీదత్

By:  Tupaki Desk   |   28 Jan 2017 10:14 AM GMT
ఇలాంటి వారి వెనుక ఎవరూ ఉండరు-అశ్వనీదత్
X
మధ్యలో కొంచెం చల్లబడిపోయిన ప్రత్యేక హోదా పోరాటం ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. యువత ఇచ్చిన పిలుపుతో మొన్న విశాఖపట్నంలో మౌన నిరసన ప్రదర్శన కొంచెం గట్టిగానే చేశారు. ముందు నుంచి హోదాపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. జనసేన అధినేత పవన్ కూడా జత కలిశాడు. జనాల్లో మళ్లీ ఒకప్పటి ఎమోషన్ కనిపిస్తోంది. సినీ సెలబ్రెటీలు కూడా చాలామంది ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ నిర్మాత.. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన అశ్వినీదత్.. ఈ పోరాటానికి వ్యతిరేకంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేస్తున్నవారికి బుద్ధి లేదంటూ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై జరుగుతున్న పోరాటంపై మీ స్పందనేంటని అశ్వినీ దత్ ను అడిగితే.. ‘‘కలిసి ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్‌ కైమా చేసింది. విడిపోయిన రాష్ట్రం కష్టాలను చంద్రబాబు తన భుజాన వేసుకుని కష్టపడుతున్నారు. ఐతే ఆయన్ని ఆ స్థానం నుంచి తప్పించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? మరింతగా దోచుకుంటారు. ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకులకు ఎవరూ మద్దతివ్వరు. సీఎం చంద్రబాబు కంటే రాష్ట్రం గురించి ఎక్కువగా ఎవరూ ఆలోచించరు. ఇలాంటి బుద్ధిలేని వారి వెనుక ఎవరూ ఉండరు’’ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/