Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ఖరీదు: తెలంగాణలో 100 కోట్లు.. రాజస్థాన్ లో 10 కోట్లేనా?

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:30 AM GMT
ఎమ్మెల్యే ఖరీదు: తెలంగాణలో 100 కోట్లు.. రాజస్థాన్ లో 10 కోట్లేనా?
X
తెలంగాణకు, రాజస్థాన్ కు శాన్ ధార్ ఫరక్ (తేడా) ఉంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామన్న బీజేపీ ఏజెంట్లు.. అదే రాజస్థాన్ లో కేవలం 10 కోట్లు మాత్రమే ముట్టజెప్పుతామన్నారు. ఇది మనం అంటున్న విషయం కాదు.. స్వయంగా రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ తాజాగా అన్న మాటలు ఇవీ

2020లో తన ప్రభుత్వాన్ని కూల్చడానికి సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసినప్పుడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్యాంపుకు వెళ్లి మరీ బేరాలు జరిపారని.. ఒక్కో ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇచ్చారని ఆధారాలు ఉన్నాయని గెహ్లాట్ తెలిపారు. అలాంటి తిరుగుబాటు ద్రోషిని సీఎం చేస్తే పార్టీ నాశనం అవుతుందనేది ఆయన మాట.. నిజానికి ఆయన సచిన్ ను విమర్శిస్తున్నట్టుగా కాదు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరిస్తున్నట్టుగానే ఈ మాటలు ఉన్నట్టు అర్థమవుతోంది.

రెండేళ్ల క్రితం సచిన్ పైలట్, ఆయనకు విధేయులైన 18మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన లేదని వివరణ ఇచ్చారు.గతంలోనే సచిన్ పైలట్ కాంగ్రెస్ లో అసమ్మతి రాజేసారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేలా ప్రయత్నించారు. సచిన్ పైలెట్ ను రప్పించి మెప్పించి కాంగ్రెస్ లోనే ఉండేటట్టు చేసింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీనే అన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా ఉండేటట్టు కాపాడింది ప్రియాంకగాంధీనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.సచిన్ పైలట్ కు ప్రస్తుతం పాత పదవులు ఇచ్చేటట్టు అతడి మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటట్టు ప్రియాంక గాంధీ ఒప్పించినట్టు తెలిసింది. అలాగే వచ్చే ఎన్నికల క్యాంపెయిన్ అంతా సచిన్ పైలెట్ కు అప్పజెప్పి గెలిస్తే సీఎంను చేస్తాము అని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రియాంక గాంధీ చొరవ తీసుకుందని.. ‘నీవు నా తమ్ముడితో సమానం అని ప్రియాంక.. సచిన్ ను ఒప్పించిందని’ ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే దీన్ని జీర్ణించుకోలేని అశోక్ గెహ్లాట్ అడుగడుగునా సచిన్ పైలెట్ ను తొక్కేస్తున్నాడు. సచిన్ రాజస్థాన్ సీఎం కాకుండా ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని సైతం అశోక్ వదులుకొని అసమ్మతి రాజేశారు.

ఈ క్రమంలోనే బీజేపీ అశోక్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందన్న ఆరోపణలున్నాయి. ఆ టైంలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే 10 కోట్లు ఇవ్వడానికి బీజేపీ మొగ్గు చూపిందన్నారు. ఇక ఇదే బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు చొప్పున చెల్లిస్తామనడంపై సంచలనమైంది. రాజస్థాన్ ఎమ్మెల్యేతో పోల్చితే తెలంగాణ ఎమ్మెల్యేలే ఖరీదా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.