Begin typing your search above and press return to search.

కరోనాకు ‘అప్పడం’ బెస్ట్ అన్న కేంద్రమంత్రికి పాజిటివ్

By:  Tupaki Desk   |   9 Aug 2020 6:33 AM GMT
కరోనాకు ‘అప్పడం’ బెస్ట్ అన్న కేంద్రమంత్రికి పాజిటివ్
X
కరోనా సెగ అందరికీ తగులుతోంది. హీటెక్కిస్తోంది. ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుంటోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైరస్ సోకగా..తాజాగా కేంద్రమంత్రులకు సైతం ఈ వైరస్ సోకింది.

ఇటీవల కరోనా నివారణకు అప్పడం తినండని పిలుపునిచ్చి నవ్వులపాలైన కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ తాజాగా అదే కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

రెండుసార్లు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ కరోనా టెస్టు చేయించుకోగా.. రెండోసారి ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కేంద్రమంత్రి అర్జున్ చేరారు.

తనకు కరోనా సోకిందని.. తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా టెస్ట్ చేయించుకోవాలని అర్జున్ రామ్ మేఘ్ కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇటీవల కరోనా నివారణకు అప్పడాలు బాగా పనిచేస్తాయని.. వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించి కేంద్రం అర్జున్ రామ్ నవ్వులు పూయించారు. ‘భా బీజీ అప్పడాలు’ అంటూ వాటికి ప్రమోషన్ కల్పిస్తున్నట్టు చేతిలో పట్టుకొని పబ్లిసిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే కరోనా బారిన పడడం గమనార్హం.